రాణి అహల్యాబాయి హోల్కర్: దైవత్వం ఉట్టిపడే ధర్మ పరిపాలకురాలు (Rani ahilyabai holkar history in telugu)

rani ahilyabai holkar history in telugu

రచయిత : ఇ.పవన్ కుమార్

 

రాణి అహల్యాబాయి హోల్కర్: దైవత్వం ఉట్టిపడే ధర్మ పరిపాలకురాలు, ఆమె పాలన  లో  ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది , యుద్దాలు , అరాచకాలు , కుతంత్రాలు ప్రబలంగా ఉన్న ఆ రోజులలో రాణి అహల్యాబాయి తన ప్రజలకు శాంతిని మరియు శ్రేయస్సు అందించింది మరియు ఆమె పాలన ఒక స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందింది.

rani ahilyabai holkar history in telugu

భారత దేశ చరిత్రలో స్త్రీ శక్తికి , ధర్మ పాలనకు ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచినా మహోన్నత వ్యక్తి రాణి అహిల్యా భాయి హోల్కర్. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన నిజమయిన ” రాజమాత “

18 వ శతాబ్దం లో మరాఠా సామ్రాజ్యం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్న వేళ , మధ్య భారతదేశం లోని మాల్వా ప్రాంతాన్ని దాదాపు 28 సంవత్సరాలు పరిపాలించిన మహారాణి అహిల్యా భాయి హోల్కర్.

 

ఆమె గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు ..

జననం : అహల్య భాయి మే 31 , 1725  సం.. చౌన్ది , అహ్మద్నగర్ , మహారాష్ట్ర లో జన్మించింది .

తల్లి తండ్రులు : మాంకోజీ రావు షిండే మరియు షశీల షిండే ..

తండ్రి మాంకోజీ రావు షిండే గ్రామానికి పాటిల్ గా వ్యవహరించే వారు ..

చిన్నతనం లో నే  అహల్య భాయి ని కండేరావు హోల్కర్ కి ఇచ్చి వివాహం జరిపించారు , ఈ మల్హర్ రావు హోల్కర్ యొక్క కుమారుడు మరియు హోల్కర్ సామ్రాజ్యాన్ని ఇండోర్ లో స్థాపించాడు.

పిల్లలు : 1754  లో వీరికి మాలెరావు అనే కుమారుడు జన్మించాడు మరియు 1758 లో ముక్త బాయి అనే కుమార్తె జన్మించింది .

భర్త మరణం : 1754 లో జరిగిన కుంభార్ యుద్ధం లో భర్త ఫిరంగి గుళ్లకు బలిఅయ్యాడు ..

భర్త తో పాటు సతి సహగమనం చేసుకుందామని ప్రయతించింది కానీ మల్హర్ రావు వారించాడు , నీ అవసరం ఈ రాజ్యానికి మరియు దేశానికి ఉంది అని ఆమెను ముందుకు నడిపాడు .

అహల్య భాయి రాజ్య తంత్రము , రాజ్య పాలన , యుద్ధ విద్యలు నేర్చుకున్నది , మామ గారు మల్హర్ రావు రాజ్య పాలన కోసం వివిధ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ,ఈమెనే రాజ్య పాలన చూసుకునేది .

అహల్య భాయి  హోల్కర్ , గొప్ప ధార్మికురాలు , శివ భక్తురాలు , గొప్ప దార్శనికత కలిగిన పాలకురాలు .

ఈమె యొక్క సామర్త్యాల గురించి ఈమెకు సంబందించిన లేఖ సంభాషణ లలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

మామ మరణం : భర్త యొక్క తండ్రి గారయిన మల్హర్ రావు 1766 లో మరణించారు .తదనంతరం కొడుకు మాలె రావు మాల్వా సింహాసనాన్ని  అధిష్టించాడు కానీ కొన్ని అనారోగ్య కారణాల వల్ల కొడుకు మాలె రావు మరణించాడు .

ఇక అహల్య భాయి తన రాజధానిని ఇండోర్ నుండి మహేశ్వర్ కు మార్చింది ,

న్యాయమైన మరియు దయగల పాలన: అహల్యాబాయి తన ప్రజల సంక్షేమంపై దృష్టి సారించి, న్యాయమైన మరియు దయగల పాలనకు ప్రసిద్ధి చెందింది.

పరిపాలనా పరాక్రమం: ఆమె ఒక చతురతగల నిర్వాహకురాలు, సమర్థవంతమైన పన్ను వ్యవస్థను స్థాపించి, శాంతిభద్రతలను కాపాడింది.

rani ahilyabai holkar history in telugu

న్యాయ సంస్కరణలు: ఆమె న్యాయం పట్ల చాలా శ్రద్ధ వహించింది, ఫిర్యాదులను విని న్యాయంగా పరిష్కరించేలా చూసుకుంది.

సైనిక చతురత: పురుషాధిక్య యుగంలో స్త్రీ అయినప్పటికీ, ఆమె గణనీయమైన సైనిక చతురతను ప్రదర్శించింది, అవసరమైనప్పుడు వ్యక్తిగతంగా సైన్యాలను యుద్ధంలోకి నడిపించింది.

కళలు మరియు సంస్కృతి పోషకురాలు: అహల్యాబాయి కళ, సంస్కృతి మరియు విద్యకు గొప్ప పోషకురాలు. ఆమె నేయడాన్ని, ముఖ్యంగా ప్రసిద్ధ మహేశ్వరి చీరలను ప్రోత్సహించింది.

నేను 2023 లో మహేశ్వర్ ను సందర్శించినప్పుడు అక్కడ గైడ్ చెప్పినదాని ప్రకారం అక్కడ చీరలు చాల ప్రసిద్ధి మరియు సినిమా తారలు కూడా అక్కడికి వచ్చి కొంటారని చెప్పాడు.

అంటే అహల్యాబాయి యొక్క ముందు చూపు ఇప్పుడు అక్కడి వారికి జీవనోపాధిని చూపిస్తోంది .

మహిళా సాధికారతకు అహర్నిశలు కృషి చేసారు , ఎన్నో విద్యాలయాలను స్థాపించారు ..

దేవాలయాలు మరియు ఘాట్ల నిర్మాణం: భారతదేశం అంతటా అనేక దేవాలయాలు, ఘాట్లు (స్నానపు మెట్లు), బావులు మరియు ధర్మశాల (ధర్మశాలలు – విశ్రాంతి గృహాలు) నిర్మాణం మరియు పునరుద్ధరణకు  ఆమె అత్యంత ముఖ్యమైన సహకారాన్ని అందించింది .

మత భక్తి: ఆమె చాలా మతపరమైనది మరియు తన వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగాన్ని మతపరమైన దానాల కోసం ఖర్చు చేసింది.

 

ముఖ్యమైన పునరుద్ధరణలు: ఆమె కాశీ విశ్వనాథ ఆలయం, సోమనాథ ఆలయం, గయ, ద్వారక మరియు అనేక ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాలలో విస్తృతమైన పునరుద్ధరణ పనులను చేపట్టింది.

1780  లో కాశీవిశ్వనాథ ఇపుడున్న ఆలయాన్ని నిర్మించింది

ఇప్పుడు ఉన్న విష్ణుపాద దేవాలయాన్ని గయా లో 1787  లో పునర్నిర్మించింది.

1789 లో మహారాష్ట్ర లో ని త్రైయంబకేశ్వర్ జ్యోతిర్ లింగాన్ని పునర్నిర్మించింది.

మహారాష్ట్ర లో ని ఎల్లోరా గుహల వద్ద ఉన్న గ్రిశ్నేశ్వర్ మందిరాన్ని పునర్నిర్మించారు

telugu bhakthi

ఆర్థిక శ్రేయస్సు: ఆమె పాలనలో, స్థిరమైన పరిపాలన మరియు వాణిజ్య ప్రోత్సాహం కారణంగా మాల్వా రాజ్యం   ఆర్థికంగా అభివృద్ధి చెందింది.

ఇతర పాలకుల నుండి గౌరవం: ఆమె జ్ఞానం మరియు సమగ్రత ఆమెకు ఇతర పాలకుల నుండి మరియు బ్రిటిష్ వారి నుండి కూడా గౌరవాన్ని సంపాదించిపెట్టింది.

సరళమైన జీవనశైలి: ఆమె రాజ హోదా ఉన్నప్పటికీ, ఆమె సరళమైన మరియు కఠినమైన జీవితాన్ని గడిపింది, ఎల్లప్పుడూ తన ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చింది.

వారసత్వం: అహల్యాబాయి హోల్కర్ ఒక సాధువు రాణి (రాజమాత)గా గౌరవించబడుతోంది మరియు ఆమె భక్తి, జ్ఞానం, ధైర్యం మరియు అసాధారణమైన పాలనకు గుర్తుండిపోతుంది, శాంతి మరియు శ్రేయస్సు యొక్క వారసత్వాన్ని వదిలివేస్తుంది.

ఆమె పాలనను మాల్వా చరిత్రలో తరచుగా “స్వర్ణయుగం”గా పిలుస్తారు.

ఈమె గౌరవార్థం అహ్మద్నగర్ ను అహల్య నగర్ గా పేరు మార్చారు

మహిళా సాధికారతకు అహర్నిశలు కృషి చేసారు , ఎన్నో విద్యాలయాలను స్థాపించారు ..

రాణి అహల్యాబాయి మహేశ్వర్ లో కోటను నిర్మించారు ,ఆ కోటను అహల్య  కోట అనిపిలుస్తారు .ఇది పవిత్రమయిన నర్మదా నది ఒడ్డున ఉంటుంది ..ఈ కోటాలో ఎన్నో అద్భుత మయిన దేవాలయాలను నిర్మించారు.

ఈమె గౌరవార్థం అహ్మద్నగర్ ను అహల్య నగర్ గా పేరు మార్చారు.

1791 లో అహల్య భాయి కూతురు భర్త యశ్వంత్ రావు మరణించగా సతి సహగమనం చేసుకుంది .

రాణి అహల్య భాయి హోల్కర్ 17 ఆగష్టు 1795  లో స్వర్గస్తురాలయింది.

తుకోజి రావు హోల్కర్  : అహల్య భాయి మరణం తరువాత తుకోజి రావు హోల్కర్ సింహాసన్నాని అధిష్టించాడు , ఈయన అహల్య భాయి దగ్గర కమాండర్ గా పనిచేసాడు .

తుకోజి రావు హోల్కర్ మల్హర్ రావు హోల్కర్ యొక్క దత్తపుత్రుడు మరియు ఆయన మల్హర్ రావు హోల్కర్ మేనల్లుడు శ్రీమంత్ తనుజీ హోల్కర్ రెండవ కుమారుడు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *