Updated : 27-04-2025
రచయిత : ఇ.పవన్ కుమార్ శర్మ
” నాన్యా స్త్రాతా నాపి దాత న భర్తా | తత్వో దేవత్వం శరన్యో శోక హర్తా |
కుర్వాత్రేయ అనుగ్రహం పూర్ణ రాతే | గోరత్కష్టదుద్దరాస్మాన్ నమస్తే | “
హే శరణాగత వత్సల ! నువ్వు తప్ప పోషకుడు , యజమాని , రక్షించువారు , కృపాకరుడు ఎవరు లేరు . ఎవరు నిన్ను సంపూర్ణంగ శరణు వేడుకొంటారో అటువంటి వారిని దయతో అనుగ్రహిస్తావు . ఓ దత్త ప్రభో ! నన్ను ఇహపర కష్టముల నుంచి ఉద్ధరించే శ్రీ దత్తాత్రేయ ప్రభో నీకు నమస్కారం .
దత్తాత్రేయుడు ఎవరు ?
దత్తాత్రేయుడు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల యొక్క సమ్మిళిత రూపం.
దత్తాత్రేయుడిని ఏమని పిలుస్తారు ?
” త్రిమూర్తి స్వరూపుడు ” ” ఆది గురువు ” అని పిలుస్తారు.
దత్తాత్రేయుని జన్మ వృత్తాంతం ?
మార్కండేయ పురాణం ప్రకారం అత్రి మహర్షి మరియు అతని భార్య అనసూయ దేవి చాల తపోనిష్ఠ కలవారు,
నారద మహర్షి వీరి తపో నిష్ఠను మరియు పాతివ్రత్యం గురించి బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల యొక్క భార్యలకు వివరించాడు. వారు వీరిని పరీక్షిద్దాం అని అనుకుని ..ఈ ముగ్గురిని వారి వద్దకు పంపించారు ..
ఒక దినాన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు అనసూయ దేవి ఇంటికి వచ్చి బిక్ష పెట్టమని అడిగారు , అందులో ఒక షరతు పెట్టారు ఆ షరతు ఏమిటంటే మీరు మాకు బిక్ష పెట్టాలంటే మీరు నగ్నముగా ఉండి వడ్డించాలి అని అడిగారు ..
అందులకు ఆమె వారికి బిక్ష పెట్టకుండా పంపితే వాళ్ళు ఆకలితో బాధపడతారు పెట్టకుండా పంపడం మహా పాపం అని అనుకుని , వారి షరతుకు అంగీకరించింది .
అప్పుడు అనసూయ దేవి తన మనస్సులో భర్తను తలుచుకుని వారి తపో శక్తి తో ఆ ముగ్గురిని చిన్న పిల్ల ల లాగ మార్చివేసింది.
అప్పుడు ఆ ముగ్గురు చిన్న పిల్ల వాళ్ల లా మారిపోయారు ,అలా ఆమె వారికి బిక్ష పెట్టి చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చింది .
తన భర్త ఇంటికి వచ్చే సరికి ఈ ముగ్గురు పిల్లలను చూసి వారు భగవత్ స్వరూపులని తెలుసుకుని వారిని స్తుతించే సరికి వారు వారి నిజమయిన రూపాన్ని ఆ దంపతులకు చూపించారు .
ఆ ముగ్గురు ఈమె త్యాగాన్ని చూసి మేము ముగ్గురం కలిసి మీ గర్భం లో ఒకే కుమారుని లాగా జన్మిస్తాం అని వరమిచ్చారు ..
అలా అనసూయమాత మరియు అత్రి దంపతులకు దత్తాత్రేయుడు జన్మించాడు …
” దత్త “ అనగా సమర్పించుకున్న అని అర్థం , దీన్ని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి ఒకటి త్రిమూర్తులు తమ యొక్క మూడు శరీరాలను ఈ పుణ్య దంపతులకు సమర్పించుకున్నారు దత్తాత్రేయుని రూపం లో .
రెండవది : మనం మనుషులం మన కున్న అడ్డుగోడలు (కోపం , ఆక్రోశం , గర్వము ) వీటిని ఆ భగవన్తంతుడికి సమర్పించుకోవాలి ..ఇలా జరిగినప్పుడు ఆ దత్తాత్రేయుని కృప మన మీద కలిగి కలియుగ బాధలనుండి విముక్తి కలుగుతుంది.
దత్తాత్రేయుని అంశ జ్ఞానానికి ప్రతీక , దత్తాత్రేయుడు ఆది గురువు.
ఎప్పటివరకు ఈ ప్రపంచం మీద అజ్ఞానం ఉంటుందో అప్పటి వరకు గురువు యొక్క అవతారం కొనసాగుతూ ఉంటుంది .
విష్ణువు యొక్క అవతారాలలో దత్తాత్రేయులు 8 వ అవతారంగా చెపుతారు .
దత్తాత్రేయుని రూపం మూడు ముఖాలు (బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల యొక్క ప్రతీక ) , ఆరు చేతులు (శక్తి కి సంకేతం ) , 4 శునకాలు (4 వేదాలకు ప్రతీక )
కలియుగం లో దత్తాత్రేయుని యొక్క ముఖ్య అవతారాలు :
శ్రీపాద శ్రీవల్లభులు , నృసింహ సరస్వతి స్వామి , అక్కల్ కోట్ స్వామి సమర్థ ,గంగాధర సరస్వతి స్వామి (గురు చరిత్రను లిఖించిన మహాత్ములు), వాసుదేవానంద సరస్వతి స్వామి (టెంబే స్వామి) , సాయి బాబా , మొగిళిచర్ల అవధూత స్వామి , గణపతి సచ్చిదానంద స్వామి , నానా మహారాజ్ తారనేకర్ , మాణిక్ ప్రభు మహారాజ్ , సంత్ గజానన్ మహారాజ్ , స్వామి గంగ గిరి మహారాజ్ , తాజుద్దీన్ బాబా , గులవని మహారాజ్ , మాణిక్ ప్రభు మహారాజ్ — ఇంకా ఎందరో దత్త గురువులు మన పుణ్యభూమి లో కొలువై ఉన్నారు.
తప్పకుండ చూడవలసిన దత్త క్షేత్రాలు :
🕉 గానగపూర్ దత్త క్షేత్రం — కర్ణాటక
🕉 మాణిక్ ప్రభు సంస్థాన్ – మాణిక్ నగర్ – కర్ణాటక
🕉 అవధూత దత్తపీఠం మైసూర్ – కర్ణాటక
🕉 కారంజ — మహారాష్ట్ర
🕉 నర్సోబావాడి — మహారాష్ట్ర
🕉 ఔదుంబర్ — మహారాష్ట్ర
🕉 మహోర్ దత్త క్షేత్రం – మహోర్ – మహారాష్ట్ర
🕉 శ్రీ క్షేత్ర పావని : మహారాష్ట్ర
🕉 షిర్డీ — మహారాష్ట్ర
🕉 షెగావ్ — మహారాష్ట్ర
🕉 మాన్గావ్ — మహారాష్ట్ర
🕉 శ్రీపాద శ్రీవల్లభ దత్త క్షేత్రం – పిఠాపురం – ఆంధ్రప్రదేశ్
🕉 శ్రీశైలం — ఆంధ్రప్రదేశ్
🕉 ఎత్తిపోతల — ఆంధ్రప్రదేశ్
🕉 మొగిళిచర్ల — ఆంధ్రప్రదేశ్
🕉 దత్త ముక్తి క్షేత్రం – రాజమండ్రి – ఆంధ్రప్రదేశ్
🕉 గిరినార్ — గుజరాత్
🕉 కురువపురం దత్త క్షేత్రం — తెలంగాణ
🕉 సంతచారి దత్త మఠము – నిజామాబాద్ – తెలంగాణ
🕉 దత్త క్షేత్రము — మల్లారం – నిజామాబాద్ – తెలంగాణ
🕉 నానా మహారాజ్ తారనేకర్ ఆశ్రమం – ఇండోర్ (మధ్యప్రదేశ్ )
🕉 ఏకముఖ దత్తాత్రేయ మందిర్ – వారణాసి (కాశి) – ఉత్తర్ ప్రదేశ్
ఇవే కాకుండా ఇంకా ఎన్నో దత్తాత్రేయ స్వామి వారి అద్భుతమయిన క్షేత్రాలు కలవు .
దత్త సాంప్రదాయం అంటే ఏమిటి ?
వివిధ పద్దతుల లో దత్తత్రేయుని ఉపాసించడాన్ని దత్త సాంప్రదాయం అంటారు , కొన్ని దత్త సంప్రదాయాలు …
✅ పురాణ సాంప్రదాయం
✅ గురుచరిత్ర సాంప్రదాయం
✅ నిరంజన్ రఘునాథ్ సాంప్రదాయం
✅ అవధూత పంత్ సాంప్రదాయం
✅ శ్రీ కళావతి స్వామి సాంప్రదాయం
✅ వార్కరీ సాంప్రదాయం
దత్త ఉపాసన ఎలా చేయాలి ?
ఏ దేవుడి ఉపాసనకయినా కొంత క్రమశిక్షణ , కొన్ని ఉపాసన పద్ధతులు అవలంభించాలి .దత్త ఉపాసనలో దత్త గురువు నుండి (దత్త ఉపాసకులు ) నుండి దత్తాత్రేయ మంత్రాన్ని స్వీకరచించాలి , దాన్ని గురువు చెప్పినట్టుగా త్రికరణ శుద్ధి గా ఆచరించాలి.
గురుచరిత్ర , వాసుదేవానంద స్వామి చరిత్ర , శ్రీ పాద శ్రీవల్లభుల చరిత్ర లేదంటే మీకు నచ్చిన గురువుల యొక్క చరిత్ర పారాయణం చేయడం అత్యంత శుభప్రదం.
సాత్వికంగా ఉండటం నేర్చుకోవాలి , మనలో ఉండే కొన్ని అవరోధాలను మెల్లిగా తీసివేయాలి .
ప్రతిరోజు కొంత సమయాన్ని ఉపాసనకు కేటాయించాలి.
వీలయితే దత్త క్షేత్రాలను సందర్శించాలి.
దత్తాత్రేయుని అవతారం గా కొలువబడే పరమ పూజ్య వాసుదేవానంద సరస్వతి స్వామి యొక్క స్తోత్రాలను పఠించాలి.
గురువుల తో ,పెద్దల తో గౌరవ పూర్వకంగా ఉండాలి. తల్లి తండ్రులే ఆది గురువులు వారిని దత్త స్వరూపాలుగా చూడాలి .
దత్తాత్రేయ స్వామి జయంతి రోజు వీలయితే అన్నదానం , క్ష్త్రేత సందర్శనమ్ లేదా ఇంట్లో నే దత్తుడికి శక్తి కొలది పూజ చేయడం వల్ల ఆయుర్ ఆరోగ్యాలు ,జ్ఞాన సముపార్జన, శత్రు బాధలు , అకాల బాధలు , ఆటంకాలు తొలిగిపోతాయని నా యొక్క అభిప్రాయం.
ధన్యోస్మి
” దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర “
మీ యొక్క విలువయిన అభిప్రాయాలూ , సూచనలు మరియు సలహాల కోసం సంప్రదించండి : WhatsApp : 9398601060
Follow www.plus100years.com for regular updates